BJP: ముస్లిం మహిళలు ఓటరు కార్డు చూపుతున్న వీడియో పోస్ట్ చేసి, బీజేపీ వివాదాస్పద వ్యాఖ్యలు!

  • ట్విట్టర్ ఖాతాలో పోస్ట్
  • మళ్లీ ఎన్పీఆర్ లో చూపాల్సి వస్తుంది
  • బీజేపీ కామెంట్ పై విమర్శలు

కర్ణాటక బీజేపీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ అయిన ఓ వీడియో, కామెంట్ ఇప్పుడు వివాదాస్పదం అయ్యాయి. ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా, ఓ పోలింగ్ కేంద్రం వద్ద క్యూ కట్టిన మైనారిటీ మహిళలు, తమ చేతిలోని గుర్తింపు కార్డులను చూపుతూ ఉండగా, తీసిన వీడియోను పోస్ట్ చేసిన బీజేపీ, కర్ణాటక విభాగం, "గుర్తింపు కార్డులు జాగ్రత్తగా ఉంచుకోండి. మళ్లీ ఎన్పీఆర్‌ సర్వేలో చూపించాల్సి ఉంటుంది" అని కామెంట్ చేయడం ఇప్పుడు విమర్శలను కొనితెచ్చింది. బీజేపీ వైఖరిపై పలువురు నిప్పులు చెరుగుతున్నారు. కర్ణాటక బీజేపీ ట్విట్టర్ ఖాతాలో ఈ ట్వీట్ ఢిల్లీలో ఎన్నికలు జరిగిన 8వ తేదీన పోస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది.

More Telugu News