Amaravati: అమరావతి ఉద్యమం విస్తృతం చేయాలని ఎన్ఆర్ఐ జేఏసీ నిర్ణయం

  • రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్
  • మోదీకి వినతిపత్రాలు పంపాలని నిర్ణయం
  • విద్యార్థులు, రైతులపై కేసులు ఎత్తివేయాలని డిమాండ్

రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని ఎన్ఆర్ఐ జేఏసీ డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో అమరావతి ఉద్యమాన్ని విస్తృతం చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ విషయమై ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారు ఉన్న 70కి పైగా దేశాల నుంచి వినతిపత్రాలు ప్రధాని మోదీకి పంపాలని నిర్ణయం తీసుకుంది. ఈ నెలాఖరు నాటికి విద్యార్థులు, రైతులపై కేసులు ఎత్తివేయాలని, అలా జరగనిపక్షంలో ఈ విషయాన్ని మోదీ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించింది. 

More Telugu News