Kanna Lakshminarayana: సీఏఏపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయి: కన్నా లక్ష్మీనారాయణ

  • ఏ భారతీయుడి పౌరసత్వానికి సీఏఏతో ఇబ్బంది లేదు
  • ‘రియల్’ వ్యాపారం కోసమే 3 రాజధానుల ఆలోచన
  • ‘స్థానిక’ ఎన్నికల్లో బీజేపీ-జనసేన కలిసి పోటీ చేస్తాయి

జాతీయ పౌరసత్వ చట్ట సవరణ (సీఏఏ)పై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని ఏపీ బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. విజయనగరంలో ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏ భారతీయుడి పౌరసత్వానికి సీఏఏతో ఇబ్బంది లేదని మరోమారు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మూడు రాజధానుల అంశం గురించి ప్రస్తావిస్తూ, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఈ ఆలోచన చేశారని విమర్శించారు. విశాఖకు కొత్తగా సచివాలయం రావడం ద్వారా ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందన్నది కరెక్టు కాదని అభిప్రాయపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ-జనసేన కలిసి పోటీ చేస్తాయని స్పష్టం చేశారు.

More Telugu News