Odisha: ఒడిశాలో బస్సుకు విద్యుత్ తీగలు తగిలి ఘోర ప్రమాదం!

  • గంజాం జిల్లాలోని బొలంత్ర పరిధిలో ఘటన
  • బస్సుకు తగిలిన 11 కేవీ విద్యుత్ తీగలు
  • ఆరుగురు మృతి.. 30 మందికి గాయాలు 

ఒడిశాలో బస్సుకు విద్యుత్ తీగలు తగలడంతో ఘోర ప్రమాదం సంభవించింది. గంజాం జిల్లాలోని బొలంత్ర పరిధిలోని మంద్ రాజ్ పూర్ మార్గంలో బస్సు ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరిగింది. బస్సుకు 11 కేవీ విద్యుత్ తీగలు తగలడంతో ఆరుగురు ప్రయాణికులు మృతి చెందారు. ముప్పై మందికి గాయాలు అయ్యాయి. ఈ ఘటనలో గాయపడ్డవారిని బరంపురంలోని ఎంకేసీజీ మెడికల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు గంజాం ఎస్పీ పినాక్ మిశ్రా తెలిపారు.

More Telugu News