AB Venkateshwara Rao: టీడీపీ ఓటమికి కారణం ఏబీ వెంకటేశ్వరరావే... సన్మానిస్తారనుకుంటే సస్పెండ్ చేశారేంటి జగన్: కేశినేని నాని!

  • మీరు సీఎం అవడానికి కారణం ఆయనే
  • టీడీపీ ఓటమిలో ప్రధాన భూమిక
  • ట్విట్టర్ లో విజయవాడ ఎంపీ

గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడానికి కారణమైన ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావును జగన్ సన్మానిస్తారనుకున్నానని, కానీ సస్పెండ్ చేశారేంటని విజయవాడ ఎంపీ కేశినేని నాని ప్రశ్నించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ ను పెట్టిన ఆయన, "మీరు @ysjagan ముఖ్యమంత్రి అవ్వటానికి మీ పార్టీ @YSRCParty అధికారంలోకి రావడానికి తెలుగుదేశం పార్టీ @JaiTDP ఓడిపోవటానికి ప్రధాన భూమిక పోషించిన వ్యక్తిని సన్మానిస్తారనుకుంటే సస్పెండ్ చేశారేంటి జగన్మోహన్ రెడ్డి గారూ!!!" అని వ్యాఖ్యానించారు. నానీ ట్వీట్ ఇప్పుడు వైరల్ అయింది.

More Telugu News