Thailand: తుపాకితో స్వైరవిహారం చేసిన థాయ్ సైనికుడు... పిట్టల్లా నేలరాలిన ప్రజలు

  • థాయ్ లాండ్ లో నరమేధం
  • బైక్ పై తిరుగుతూ విచ్చలవిడిగా కాల్చిన సైనికుడు
  • 17 మంది మృతి.. మృతుల్లో ఇద్దరు పోలీసు అధికారులు
  • షాపింగ్ మాల్ లో ప్రజలను బందీలుగా పట్టుకున్న సైనికుడు

పర్యాటకుల స్వర్గధామం అని పేరుగాంచిన థాయ్ లాండ్ నెత్తురోడింది. ఓ సైనికుడు తుపాకీ చేతబూని విచ్చలవిడిగా కాల్పులు జరిపిన ఘటనలో 17 మంది బలయ్యారు. ఖోరత్ లో ఓ షాపింగ్ మాల్ వద్ద తిరుగుతూ కనిపించినవారిపై కాల్పులు జరిపాడు. ఆ సైనికుడు బైక్ పై తిరుగుతూ కాల్పులు జరిపినట్టు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. కాల్పులు జరుపుతూ షాపింగ్ మాల్ లోకి చొరబడి అక్కడున్న వారిని నిర్బంధించాడు. కాగా, ఈ కాల్పుల్లో ఇద్దరు పోలీసులు కూడా మరణించారు. అనేకమందికి గాయాలు కాగా, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులంటున్నారు. ఆ సైనికుడి పేరు జక్రాఫాంత్ తోమా అని గుర్తించారు.

More Telugu News