Nithin: 'భీష్మ' నుంచి సరాసరి సాంగ్ ఫస్టు గ్లిమ్ప్స్ 

  • వెంకీ కుడుముల నుంచి 'భీష్మ'
  • సంగీత దర్శకుడిగా మహతి స్వరసాగర్ 
  •  రేపు సాయంత్రం లిరికల్ వీడియో రిలీజ్

వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ కథానాయకుడిగా 'భీష్మ' రూపొందింది. ఈ ప్రేమకథా చిత్రంలో నితిన్ జోడీగా తొలిసారి రష్మిక నటించింది. తాజాగా ఈ సినిమా నుంచి ఒక సాంగ్ వీడియో బిట్ ను వదిలారు. "సరాసరి గుండెల్లో దించావే .. మరీ మరీ మైకంలో ముంచావే .." అంటూ ఈ పాట సాగుతోంది.

గ్రామీణ నేపథ్యంలో చిత్రీకరించిన ఈ పాట ఆహ్లాదంగా సాగుతోంది. మహతి స్వర సాగర్ అందించిన సంగీతం .. శ్రీమణి సాహిత్యం .. అనురాగ్ కులకర్ణి ఆలాపన ఆకట్టుకునేలా వున్నాయి. రేపు సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకి లిరికల్ వీడియోను వదలనున్నారు. ఈ నెల 21వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. నితిన్ .. రష్మిక జోడీని తెరపై చూడటానికి అభిమానులు ఆసక్తితో వున్నారు. ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి మరి.

More Telugu News