Anushka: ఐదు భాషల్లో ఏప్రిల్ 2న విడుదలవుతున్న 'నిశ్శబ్దం'

  • హేమంత్ మధుకర్ నుంచి 'నిశ్శబ్దం'
  • చిత్రకారిణి పాత్రలో కనిపించనున్న అనుష్క
  • ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు

నాయిక ప్రాధాన్యత కలిగిన పాత్రలకు అనుష్క పెట్టింది పేరు. కథా భారాన్ని మొత్తం తన భుజాలపై వేసుకుని నడిపించగల సమర్థురాలు ఆమె. 'అరుంధతి' .. 'రుద్రమదేవి' .. 'భాగమతి' వంటి చిత్రాల ద్వారా ఆమె ఈ విషయాన్ని నిరూపించింది. ఆమె తాజా చిత్రంగా 'నిశ్శబ్దం' రూపొందింది. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆమె మూగ .. వినికిడి లోపం కలిగిన చిత్రకారిణి పాత్రలో కనిపించనుంది.

టీజీ విశ్వప్రసాద్ - కోన వెంకట్ కలిసి నిర్మించిన ఈ సినిమా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. హిందీ .. ఇంగ్లిష్ భాషల్లో ఏప్రిల్ 2వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. గోపీసుందర్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో మాధవన్ .. అంజలి .. షాలినీ పాండే .. అవసరాల శ్రీనివాస్ .. మైఖేల్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. అనుష్క కెరియర్లో చెప్పుకోదగిన చిత్రాల జాబితాలో ఈ సినిమా కూడా చేరిపోవడం ఖాయమనే అభిప్రాయాన్ని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.

More Telugu News