Sri chaitanya school: శ్రీ చైతన్య పాఠశాల ఉపాధ్యాయుల విహారయాత్ర బస్సు బోల్తా!

  • ప్రకాశం జిల్లాలోని పొట్లపాడు వద్ద ఘటన
  • ఆటోను తప్పించబోయి బోల్తా కొట్టిన బస్సు
  • పది మందికి గాయాలు..ఆసుపత్రికి తరలింపు

ప్రకాశం జిల్లాలో శ్రీ చైతన్య పాఠశాల బస్సు బోల్తా కొట్టింది. నరసరావుపేట శ్రీ చైతన్య పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు భైరవ కోన విహారయాత్రకు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించినట్టు సమాచారం. కురిచేడు మండలం పొట్లపాడు వద్ద ఆటోను తప్పించబోయిన బస్సు అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో నలభై మంది ఉపాధ్యాయులు ఉన్నారు. పది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమీప ఆసుపత్రికి వారిని తరలించి చికిత్స అందిస్తున్నట్టు స్థానికుల సమాచారం.

More Telugu News