Telangana: తెలంగాణ ఎన్జీవోల క్రీడల్లో విషాదం... సురేశ్ అనే ఉద్యోగి మృతి

  • పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న సురేశ్
  • కబడ్డీ ఆడుతూ కుప్పకూలిన సురేశ్
  • ఆసుపత్రికి తరలించినా దక్కని ఫలితం
  • చికిత్స పొందుతూ మృతి

నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ మైదానంలో తెలంగాణ ఎన్జీవోల క్రీడా పోటీలు నిర్వహించారు. అయితే ఈ క్రీడల్లో విషాదం చోటుచేసుకుంది. డిచ్ పల్లి మండలం మెంట్రాజ్ పల్లి పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న సురేశ్ మరణించారు. ఈ క్రీడల్లో సురేశ్ కూడా పాల్గొన్నారు. అయితే కబడ్డీ ఆడుతుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఇతర ఉద్యోగులు అతడిని ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. చికిత్స అందిస్తుండగానే కన్నుమూశాడు. దాంతో ఉద్యోగ వర్గాల్లో తీవ్ర విషాదం అలముకుంది.

More Telugu News