KIA Motors: అనంతపురం నుంచి తరలింపు వదంతులు నమ్మొద్దంటూ.. కియా ఎండీ కీలక ప్రకటన

  • ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాం
  • అనంత నుంచే కొత్త మోడళ్లను ఉత్పత్తి చేస్తాం
  • ‘కియా’ ఎండీ ప్రకటనను చదివి వినిపించిన సంస్థ పీఆర్వో

అనంతపురంలోని కియా యూనిట్ పక్క రాష్ట్రానికి తరలిపోతుందంటూ వస్తున్న వదంతులను ఖండిస్తూ, ఆ సంస్థ ఎండీ ఓ కీలక ప్రకటన చేశారు. కియా పరిశ్రమను తమిళనాడుకు తరలిస్తారన్న వదంతులను నమ్మొద్దని స్పష్టం చేశారు. ఈ ప్రకటనను మీడియా సమక్షంలో కియా సంస్థ పీఆర్వో చదివి వినిపించారు. ఇండియా మార్కెట్ పై లక్ష్యంతో అనంతపురంలో తమ యూనిట్ ను ఏర్పాటు చేశామని, ఇక్కడి నుంచి దీనిని ఎక్కడికీ తరలించడం లేదని తెలిపారు. ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నామని, ఈ యూనిట్ నుంచే కొత్త మోడళ్ళను ఉత్పత్తి చేస్తామని వివరించారు.

More Telugu News