Galla Jayadev: 'వైఎస్సార్సీపీ ఫోరం' నిర్వహించిన మరో పోల్ వివరాలను స్క్రీన్ షాట్ సహా పోస్టు చేసిన గల్లా

  • తాజాగా 'వైఎస్సార్సీపీ ఫోరం' పోస్టులను ట్వీట్ చేసిన టీడీపీ ఎంపీ
  • అమరావతిపై, మండలి రద్దుపై ప్రజాభిప్రాయం కోరిన 'వైఎస్సార్సీపీ ఫోరం'
  • రెండింట్లోనూ ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా అత్యధిక ఓట్లు

'వైఎస్సార్సీపీ ఫోరం' నిర్వహించిన ఓ ఆన్ లైన్ పోల్ లో అత్యధికులు అమరావతికే జై కొట్టిన పోస్టును స్క్రీన్ షాట్ సహా పోస్టు చేసిన టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్, అలాంటిదే మరో పోస్టును తాజాగా ట్వీట్ చేశారు. ఈ పోస్టులో 'వైఎస్సార్సీపీ ఫోరం' ఏపీ శాసనమండలి రద్దుపై ప్రజాభిప్రాయాన్ని కోరింది. అయితే, ఈ పోల్ లో 81 శాతం మంది మండలి రద్దును వ్యతిరేకిస్తున్నట్టు చెప్పగా, 19 శాతం మంది మాత్రమే ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించారు. ఆ వివరాలను జయదేవ్ పోస్ట్ చేశారు.

More Telugu News