Tokyo Olymipcs: టోక్యో ఒలింపిక్స్.. ముస్లింల ప్రార్థనల కోసం మొబైల్ మసీదులు!

  • జులై 24 నుంచి ఆగస్టు 9 వరకు ఒలింపిక్స్
  • 48 చదరపు మీటర్ల వైశాల్యంతో మొబైల్ మసీదులు
  • ఇతర మతాల వారికీ ఏర్పాట్లు

ఈ ఏడాది జులైలో ప్రారంభం కానున్న టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు వచ్చే ముస్లింల సౌకర్యార్థం మొబైల్ మసీదులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఒలింపిక్స్ జరిగే క్రీడా గ్రామంలో ప్రార్థనలకు అనువైన స్థలాలు లేకపోవడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. 48 చదరపు మీటర్ల వైశాల్యంతో అన్ని సదుపాయాలతో మొబైల్ మసీదులను నిర్మిస్తున్నారు. దీంతోపాటు ఇతర మతాల వారికీ అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నట్టు అధికారులు తెలిపారు. కాగా, జులై 24న ప్రారంభం కానున్న ఒలింపిక్స్ ఆగస్టు 9 వరకు జరగనున్నాయి. వివిధ క్రీడలకు సంబంధించి వేలాదిమంది క్రీడాకారులు పాల్గొననున్నారు.

More Telugu News