Devineni Uma: అమరావతి కోసం జైలుకు వెళ్లేందుకైనా సిద్ధమే: దేవినేని ఉమ

  • తుళ్లూరు రైతుల దీక్షకు దేవినేని మద్దతు
  • అమరావతిని సీఎం జగన్ చంపేశారు
  • హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పెంచేందుకే అలా చేశారు

రాజధాని అమరావతి కోసం జైలుకు వెళ్లేందుకైనా సిద్ధమేనని టీడీపీ నేత దేవినేని ఉమ అన్నారు. తుళ్లూరు రైతుల దీక్షకు ఆయన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పెంచేందుకే, అమరావతిని జగన్ చంపేశారని ఆరోపించారు. ఈ సందర్భంగా వికేంద్రీకరణ బిల్లు గురించి కూడా ఆయన ప్రస్తావించారు. శాసనమండలిలో ఈ బిల్లును ఆమోదించుకోవడం కోసం తమ ఎమ్మెల్సీలకు ఒక్కొక్కరికి రూ.3 కోట్లు చొప్పున ఆఫర్ చేశారని ఆరోపించారు.

More Telugu News