Corona Virus: చైనా నుంచి వచ్చిన ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురికి కరోనా లక్షణాలు... గాంధీ ఆసుపత్రిలో చేరిక

  • చైనా నుంచి ఇతర దేశాలకు వ్యాపిస్తున్న కరోనా
  • భారత్ లోనూ పెరుగుతున్న బాధితులు
  • సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో 10కి చేరిన బాధితుల సంఖ్య

చైనాలో విజృంభించిన కరోనా వైరస్ ఇప్పుడు ఇతర దేశాల్లోనూ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. థాయ్ లాండ్, హాంకాంగ్ లలోనూ కరోనా పీడితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. భారత్ లో సైతం ఈ మహమ్మారి బారినపడి అనేకమంది ఆసుపత్రుల్లో చేరుతున్నారు.

ఇటీవలే చైనా నుంచి వచ్చిన ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురికి కరోనా వైరస్ సోకినట్టు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ కుటుంబం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చేరింది. కరోనా లక్షణాలతో వీరు ఆసుపత్రికి వచ్చారని అక్కడి డాక్టర్లు వెల్లడించారు. ఇప్పటివరకు కరోనా లక్షణాలతో గాంధీ ఆసుపత్రికి వచ్చిన బాధితుల సంఖ్య 10కి చేరింది. ఈ ఉదయమే ఓ యువతి కేరళ నుంచి రాగా, ఆమెకు కరోనా లక్షణాలున్నట్టు అనుమానిస్తున్నారు. ఆమె కూడా గాంధీ ఆసుపత్రిలో చేరింది.

More Telugu News