Asaduddin Owaisi: 'అద్భుతం' అని ఎద్దేవా చేస్తూ.. మెట్రో రైల్‌ సంస్థపై మండిపడ్డ అసదుద్దీన్ ఒవైసీ

  • జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో పనులు పూర్తి చేసి, ప్రారంభిస్తున్నారు
  • ఇందుకు మీ వద్ద నిధులు ఉన్నాయి 
  • ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా పనులను ఎప్పుడు మొదలు పెడతారు?
  • ఎప్పుడు పూర్తి చేస్తారు? 

ఈ నెల 7వ తేదీన మెట్రో రైలు రెండో కారిడార్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. జేబీఎస్-ఎంజీబీఎస్ మీదుగా ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ విషయాన్ని తెలుపుతూ హైదరాబాద్‌ మెట్రో రైల్ ట్వీట్ చేసింది. ఈ నెల సాయంత్రం 4 గంటలకు ఈ కారిడార్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపింది. మొత్తం 11 కిలోమీటర్ల మేర మెట్రో సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొంది. దీంతో కారిడార్-1 29.. కిలోమీటర్లు, కారిడార్-3.. 29 కిలోమీటర్లతో కలిపి హైదరాబాద్‌లో మొత్తం 69 కిలోమీటర్ల మేర మెట్రోసేవలు అందుతాయని తెలిపింది.

మెట్రోరైల్ చేసిన ట్వీట్‌ను రీట్వీట్‌ చేస్తూ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. 'అద్భుతం.. జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో పనులు పూర్తి చేసి, ప్రారంభించడానికి మీ వద్ద నిధులు ఉన్నాయి. మరి హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా మధ్య పనులను ఎప్పుడు మొదలు పెడుతుంది? ఎప్పుడు పూర్తి చేస్తుంది?' అని ప్రశ్నించారు.

More Telugu News