Istanbul: 183 మందితో ల్యాండ్ అవుతూ.. మూడు ముక్కలైన విమానం

  • ఇస్తాంబుల్ లో ఘోర విమాన ప్రమాదం
  • రన్ వేపై జారిపోతూ మూడు ముక్కలైన విమానం
  • ముగ్గురు ప్రయాణికుల దుర్మరణం

ఇస్తాంబుల్ లో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. పెగాసస్ ఎయిర్ లైన్స్ కు చెందిన బోయింగ్ 737 విమానం ఇస్తాంబుల్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అవుతున్న సమయంలో రన్ వేపై అదుపుతప్పి, రన్ వే నుంచి జారిపోతుండగా విమానానికి మంటలు అంటుకున్నాయి. ఇదే సమయంలో విమానం మూడు ముక్కలైంది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 179 మంది గాయపడ్డారు. ప్రమాద సమయంలో విమానంలో 177 మంది ప్రయాణికులు, ఆరుగురు క్రూ సిబ్బంది ఉన్నారు.

టర్కిష్ టెలివిజన్ ప్రసారం చేసిన సన్నివేశాల్లో ముక్కలైన విమానం నుంచి పలువురు ప్రయాణికులు పైకి ఎక్కి వస్తుండటం కనిపిస్తోంది. భారీ వర్షం, బలమైన గాలుల నేపథ్యంలోనే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు.

More Telugu News