Sensex: నిన్నటి ఊపును ఈరోజు కూడా కొనసాగించిన మార్కెట్లు

  • 353 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 110 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 6 శాతం వరకు లాభపడ్డ టాటా స్టీల్

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. నిన్నటి ఊపును మార్కెట్లు ఈరోజు కూడా కొనసాగించాయి.  ఈ నాటి లాభాలను మెటల్, టెలికాం, రియాల్టీ సూచీలు ముందుండి నడిపించాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 353 పాయింట్లు లాభపడి 41,143కి పెరిగింది. నిఫ్టీ 110 పాయింట్లు పుంజుకుని 12,089 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టాటా స్టీల్ (5.80%), భారతి ఎయిర్ టెల్ (3.26%), టీసీఎస్ (1.91%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (1.85%), ఎల్ అండ్ టీ (1.65%).    

టాప్ లూజర్స్:
హీరో మోటో కార్ప్ (3.55%),  పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (2.24%), మారుతి సుజుకి (2.14%), ఏసియన్ పెయింట్స్ (1.20%), నెస్లే ఇండియా (0.53%).

More Telugu News