Raviteja: 'రాక్షసుడు' దర్శకుడితో రవితేజ

  • వరుస పరాజయాలతో రవితేజ 
  • 'రాక్షసుడు'తో హిట్ కొట్టిన రమేశ్ వర్మ 
  • కైరా అద్వానితో సంప్రదింపులు  

రవితేజను వరుస పరాజయాలు పలకరిస్తున్నాయి. ఇటీవల వచ్చిన 'డిస్కోరాజా' కూడా ఆయన అభిమానులను నిరాశ పరిచింది. ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతోనే ఆయన 'క్రాక్' సినిమా చేస్తున్నాడు. గోపీచంద్ మలినేని ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమా తరువాత రవితేజ .. రమేశ్ వర్మతో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాడు.

 ఈ మధ్య రమేశ్ వర్మ దర్శకత్వంలో వచ్చిన 'రాక్షసుడు' భారీ విజయాన్ని నమోదు చేసింది. తరువాత సినిమాతోనూ హిట్టే కొట్టాలనే ఉద్దేశంతో రమేశ్ వర్మ వున్నాడు. ఈయనతో రవితేజకి మంచి సాన్నిహిత్యం వుంది కూడా. గతంలో ఈ ఇద్దరూ కలిసి 'వీర' సినిమా చేశారు .. కాకపోతే అది పెద్దగా ఆడలేదు. మళ్లీ ఇంతకాలానికి ఈ కాంబినేషన్ సెట్ అయింది. ఈ సినిమాలో కథానాయికగా కైరా అద్వానిని తీసుకోవాలని అనుకుంటున్నారు. ఆమెతో సంప్రదింపులు జరుగుతున్నాయి. ఆమె గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో లేదో చూడాలి మరి.

More Telugu News