Crime News: కుటుంబ సభ్యుల చేతుల్లో వ్యక్తి దారుణ హత్య

  • ఆస్తి తగాదాలే కారణమంటున్న పోలీసులు
  • విశాఖ జిల్లాలో దారుణం
  • మాకవరపాలెం మండలం పాపయ్యపాలెం శివారులో ఘటన

ఆస్తి కోసం కుటుంబ సభ్యుడినే హత్య చేశారు కొందరు వ్యక్తులు. విశాఖ జిల్లాలో ఈ దారుణం జరిగింది. జిల్లాలోని మాకవరపాలెం మండలం పాపయ్యపాలెం శివారు ముసలిపాలేనికి చెందిన పైల శ్రీను (36) అనే వ్యక్తి నిన్న రాత్రి దారుణంగా హత్యకు గురయ్యాడు. ఆస్తి వ్యవహారాల్లో చెలరేగిన వాగ్వాదం ఘర్షణకు దారితీయడంతో ఈ హత్య జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. స్థానికంగా ఈ ఘటన సంచలనానికి కారణమైంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

More Telugu News