Amaravati: అమరావతి కోసం సీపీఐ జాతీయ సమావేశంలో తీర్మానం

  • కోల్ కతాలో సీపీఐ జాతీయ సమితి సమావేశం
  • హాజరైన సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా
  • ఏపీ రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని తీర్మానం

ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని సీపీఐ ముందు నుంచి డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. వైసీపీ ప్రభుత్వ మూడు రాజధానుల ఆలోచనను కూడా ఆ పార్టీ వ్యతిరేకిస్తోంది. ఇప్పటికే అమరావతి రైతుల పక్షాన నిలబడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తోంది. ఈ నేపథ్యంలో రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోల్ కతాలో జరిగిన సీపీఐ జాతీయ సమితి సమావేశంలో తీర్మానం చేశారు. ఈ సమావేశంలో సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, అతుల్ కుమార్, కె.రామకృష్ణ, బినయ్ విశ్వం, సుబ్బరాయన్ తదితరులు పాల్గొన్నారు.

More Telugu News