Under 19 cricket Team: టీమిండియా అండర్-19 జట్టుకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు

  • అండర్-19 ప్రపంచకప్ లో భారత్ ఫైనల్ చేరడంపై హర్షం
  • సెమీ ఫైనల్లో పాకిస్థాన్ ను చిత్తుగా ఓడించిన అండర్ 19 జట్టు
  • రికార్డు భాగస్వామ్యంతో రాణించిన యశస్వీ, దివ్యాంశ్ లకు అభినందనలు 

దక్షిణాఫ్రికాలో జరుగుతున్న అండర్-19 క్రికెట్ ప్రపంచకప్ లో భారత జట్టు ఫైనల్లోకి చేరడంపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హర్షం వ్యక్తం చేశారు. జట్టుకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ‘సెమీ ఫైనల్లో పాకిస్థాన్ జట్టును 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించి ఫైనల్లోకి అడుగుపెట్టిన అండర్-19 భారత క్రికెట్ జట్టుకు శుభాకాంక్షలు. లక్ష్య ఛేదనలో రికార్డు భాగస్వామ్యం నెలకొల్పిన ఓపెనెర్లు యశస్వి జైస్వాల్(105 నాటౌట్), దివ్యాంశ్ సక్సేనా(59నాటౌట్)కు నా అభినందనలు’ అని తన సందేశంలో పేర్కొన్నారు. అండర్-19 క్రికెట్ జట్టు విజయంపై అభిమానుల నుంచి సామాజిక మాధ్యమాల్లో అభినందనల వెల్లువ కొనసాగుతోంది. ప్రముఖ క్రీడాకారులు, నేతలు కూడా జట్టును అభినందిస్తున్నారు.

More Telugu News