Pawan Kalyan: కర్నూలు జిల్లా కార్యకర్తల కోరిక మేరకు హైదరాబాదులో సమావేశాలు ఏర్పాటు చేసిన పవన్

  • ఈ నెల 6,7 తేదీల్లో భేటీలు
  • కర్నూలు జిల్లా హైదరాబాదుకు దగ్గరన్న కార్యకర్తలు
  • సమావేశాలు హైదరాబాదులో నిర్వహించాలని విజ్ఞప్తి
  • అంగీకరించిన జనసేన హైకమాండ్

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఓవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలతో ప్రయాణం చేయాలని నిశ్చయించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, నియోజకవర్గాల వారీగా కార్యకర్తలతో పవన్ వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే, కర్నూలు జిల్లా హైదరాబాదుకు దగ్గరగా ఉండడంతో ఈ సమావేశాలను హైదరాబాదులో నిర్వహించాలని కార్యకర్తలు కోరడంతో పవన్ సమ్మతించారు. ఈ క్రమంలో కర్నూలు జిల్లా కార్యకర్తలతో ఫిబ్రవరి 6, 7 తేదీల్లో ఆయన హైదరాబాదులో సమావేశమవుతారు. ఈ నెల 6న పాణ్యం, 7న ఎమ్మిగనూరు నియోజకవర్గ జనసైనికులతో పవన్ ముఖాముఖి మాట్లాడతారు.

More Telugu News