Roja: సీతానగరంలో త్రిదండి చినజీయర్ స్వామిని కలిసిన రోజా

  • రోజాకు మంత్రిపదవంటూ ఊహాగానాలు
  • చినజీయర్ ఆశ్రమానికి వెళ్లి ఆశీస్సులు అందుకున్న రోజా
  • తీర్థ ప్రసాదాలు అందించిన ఆశ్రమ వర్గాలు

వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజాకు ఏపీ క్యాబినెట్ లో చోటు ఖాయమంటూ ప్రచారం జరుగుతోంది. మోపిదేవి, పిల్లి సుభాష్ చంద్రబోస్ ల స్థానంలో కొత్త మంత్రులు వస్తున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రోజా గుంటూరు సమీపంలోని సీతానగరంలో త్రిదండి చినజీయర్ స్వామిని కలిశారు. ఆశ్రమానికి వెళ్లిన రోజా స్వామివారిని కలిసి ఆయన ఆశీస్సులు అందుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా రోజాను సత్కరించారు. అటు, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు కూడా చినజీయర్ స్వామిని కలిశారు.

More Telugu News