Nara Lokesh: రాజధాని మార్పుపై.. ఓ సామాన్య మహిళ అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పండి: నారా లోకేశ్

  • ట్విట్టర్ మాధ్యమంగా ఆమె మాట్లాడిన వీడియో పోస్ట్
  • జగన్ విఫలమైన సీఎం అని ట్యాగ్ లైన్
  • అమరావతి ప్రాంతంలో కొనసాగుతోన్న ఆందోళన

వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రాజధానుల ప్రతిపాదనపై అమరావతి ప్రాంత రైతులు, ప్రజలు ఆందోళనను కొనసాగిస్తున్న నేపథ్యంలో.. టీడీపీ నేత నారా లోకేశ్ తాజాగా ఉద్యమంలో పాలుపంచుకుంటున్న ఓ మహిళ మాట్లాడిన వీడియోలను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. రాజధాని మార్పుపై ఈ సామాన్య మహిళ అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము వైసీపీ నాయకులకు ఉందా? అని టీడీపీ నేత  అధికార పార్టీకి సవాల్ విసిరారు.

జగన్ ఓ విఫలమైన ముఖ్యమంత్రని ట్యాగ్ లైన్ పెట్టారు. వీడియోలో ఓ మహిళ.. జీఎన్ రావు కమిటీ నివేదికను సీఎం జగన్  చదవలేదని అర్థమైందంటూ పేర్కొంటూ.. నివేదికను వాళ్లిష్టమొచ్చినట్లు రాసుకున్నారని ఆరోపించింది. విశాఖలో వైసీపీ నేతలకు భూములున్నాయనే అక్కడికి రాజధానిని తరలిస్తున్నారని ఆరోపించింది. ఈ సందర్భంగా మండలి రద్దు, రైతుల ఉద్యమంపై ఆ మహిళ ప్రభుత్వ వైఖరిని విమర్శించింది.

More Telugu News