Sai Pallavi: మరోసారి నాని జోడీగా సాయిపల్లవి

  • ప్రస్తుతం రెండు సినిమాలు  చేస్తున్న సాయిపల్లవి
  •  తదుపరి ప్రాజెక్టుగా రాహుల్ మూవీ
  • గతంలో నానితో కలసి 'ఎంసీఏ' సినిమా    

తమిళ .. మలయాళ ప్రేక్షకుల్లోనే కాదు, తెలుగు ప్రేక్షకుల హృదయాలలోను సాయిపల్లవికి మంచి క్రేజ్ వుంది. ప్రస్తుతం ఆమె చైతూ జోడీగా 'లవ్ స్టోరీ' .. రానా సరసన 'విరాటపర్వం' చేస్తోంది. ఈ రెండు సినిమాలు కూడా సెట్స్ పైనే వున్నాయి. ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఆ తరువాత సినిమాను ఆమె నానితో కలిసి చేయనుందనేది తాజా సమాచారం.

నాని కథానాయకుడిగా దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ ఒక సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం ఆయన సాయిపల్లవిని ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం నాని - సాయి పల్లవి చేస్తున్న సినిమాలు పూర్తికాగానే, రాహుల్ ప్రాజెక్టు కోసం సెట్స్ పైకి వెళతారట. విభిన్నమైన కథాకథనాలతో ఈ సినిమా రూపొందనున్నట్టు చెబుతున్నారు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'ఎంసీఏ' ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.

More Telugu News