Airindia: కరోనా ఎఫెక్ట్: హాంకాంగ్ కు విమాన సర్వీసులు నిలిపివేయాలని ఎయిరిండియా నిర్ణయం

  • చైనా, పొరుగు ప్రాంతాల్లో కరోనా విజృంభణ
  • విమాన సర్వీసులు తగ్గిస్తున్న విమానయాన సంస్థలు
  • అదేబాటలో ఎయిరిండియా

చైనా ప్రధాన భూభాగం, దాని అధీన ప్రాంతాల్లో కరోనా వైరస్ స్వైరవిహారం చేస్తున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలు నెలకొంటున్నాయి. క్రమంగా ఇతర దేశాల్లోనూ కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో చైనాకు ఇతర దేశాల ప్రయాణికుల రాకపోకలు బాగా తగ్గిపోయాయి.

 ఇప్పటికే పలు విమానయాన సంస్థలకు చైనా, దాని పొరుగున ఉన్న తైవాన్, హాంకాంగ్ లకు విమానసర్వీసులను తగ్గించాయి. ఈ క్రమంలో భారత ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా హాంకాంగ్ కు విమాన సర్వీసులను నిలిపివేయాలని నిర్ణయించింది. ఫిబ్రవరి 8 నుంచి హాంకాంగ్ కు విమానాలు నడపరాదని నిశ్చయించుకుంది. ఫిబ్రవరి 7న నడిపే ఏఐ314 సర్వీసే హాంకాంగ్ కు ఎయిరిండియా నడిపే చివరి సర్వీసు కానుంది.

More Telugu News