BJP: అటువంటి వ్యాఖ్యలు నేను చేయలేదు: గాంధీపై వ్యాఖ్యల గురించి బీజేపీ ఎంపీ అనంత్‌ కుమార్‌ వివరణ

  • మీడియాలో వస్తోన్న వార్తల్లో నిజం లేదు
  • అటువంటి వ్యాఖ్యలు నేను చేయలేదు
  • దీనిపై అనవసర వివాదం రాజేస్తున్నారు
  • నేను చేసిన వ్యాఖ్యల వీడియో నా వెబ్ సైట్‌లో పెట్టాను 

'సత్యాగ్రహాల వల్ల బ్రిటిష్‌వారు దేశాన్ని వదిలిపోలేదు. వారు విసిగిపోయి మనకు స్వాతంత్ర్యం ఇచ్చారు. ఇలాంటి చరిత్రను చదువుతున్నప్పుడు నా రక్తం మరిగిపోతుంది. ఎంకే.గాంధీ లాంటివారు ఈ దేశంలో మహాత్ములైపోయారు' అంటూ  బీజేపీ ఎంపీ అనంత్‌ కుమార్‌ హెగ్డే చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఆయన దీనిపై స్పందించి వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. 'దీనిపై మీడియాలో వస్తోన్న వార్తల్లో నిజం లేదు. అటువంటి వ్యాఖ్యలు నేను చేయలేదు. దీనిపై అనవసర వివాదం రాజేస్తున్నారు. నేను చేసిన వ్యాఖ్యల వీడియో ప్రజలకు అందుబాటులో ఉంది. నా వెబ్ సైట్‌లో దాన్ని పెట్టాను. గాంధీ, నెహ్రూలకు వ్యతిరేకంగా నేను ఎన్నడూ వ్యాఖ్యలు చేయలేదు. స్వాతంత్ర్య పోరాటం గురించే నేను చర్చించాను' అని చెప్పుకొచ్చారు.

More Telugu News