Naga Shaurya: 'అశ్వద్ధామ' 3 రోజుల వసూళ్లు

  • యాక్షన్ హీరోగా మెప్పించిన నాగశౌర్య 
  • ప్రపంచ వ్యాప్తంగా 10.35 కోట్ల గ్రాస్ 
  • ప్రమోషన్స్ లో బిజీగా నాగశౌర్య    

తొలిసారిగా యాక్షన్ నేపథ్యాన్ని నమ్ముకుని నాగశౌర్య చేసిన 'అశ్వద్ధామ' .. జనవరి 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మెహ్రీన్ కథానాయికగా నటించిన ఈ సినిమా ద్వారా రమణ తేజ దర్శకుడిగా పరిచయమయ్యాడు. తనకి గల లవర్ బాయ్ ఇమేజ్ ను పక్కన పెట్టేసి నాగశౌర్య చేసిన ఈ సినిమా, ప్రపంచవ్యాప్తంగా తొలి 3 రోజుల్లో 10.35 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది.

ఈ వీకెండ్ వరకూ మరో సినిమా లేకపోవడం 'అశ్వద్ధామ'కి కలిసొచ్చే అంశం. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా, కర్నూల్ .. కడప .. అనంతపురం .. తిరుపతిలో ఈ సినిమా ప్రదర్శించే థియేటర్స్ కి నాగశౌర్య వెళ్లి పలకరించనున్నాడు. యాక్షన్ హీరోగానూ నాగశౌర్య మెప్పించినా, ఆయన సరైన కథాకథనాలను సిద్ధం చేసుకోలేకపోయాడనే కామెంట్లు ఎక్కువగా వినిపించాయి. లేకపోతే ఈ సినిమా మరిన్ని వసూళ్లు సాధించేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

More Telugu News