Venkatesh: 'నారప్ప' కోసం రంగంలోకి అమలా పాల్

  • తమిళనాడులో 'నారప్ప' షూటింగ్ 
  • పీటర్ హెయిన్స్ తో యాక్షన్ సీన్స్ 
  • వేసవిలో ప్రేక్షకుల ముందుకు

వెంకటేశ్ కథానాయకుడిగా 'నారప్ప' రూపొందుతోంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, తమిళంలో విజయవంతమైన 'అసురన్' కి రీమేక్. ధనుశ్ - మంజు వారియర్ జంటగా నటించిన ఈ సినిమా అక్కడ 150 కోట్లకి పైగా గ్రాస్ ను వసూలు చేసింది. ఇటీవలే 'నారప్ప' టైటిల్ తో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లింది. 'అనంతపురం'లో తొలి షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా, ప్రస్తుతం తమిళనాడులోని 'కురుమలై'లో షూటింగ్ జరుపుకుంటోంది.

పీటర్ హెయిన్స్ కంపోజ్ చేసిన యాక్షన్ సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో కథానాయికగా ప్రియమణి కనిపించనుంది. ఓ కీలకమైన పాత్ర కోసం అమలా పాల్ తో సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం. ఆమె ఎంపిక దాదాపుగా ఖరారు కావొచ్చని చెబుతున్నారు. సురేశ్ ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి మణిశర్మ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. వేసవిలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

More Telugu News