medaram: మేడారం జాతరలో శునకానికి నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్న దంపతులు

  • గతంలో కనపడకుండా పోయిన కుక్క
  • సమ్మక్క-సారలమ్మలకు మొక్కుకున్న దంపతులు
  • శునకం తిరిగి రావడంతో మొక్కులు తీర్చుకున్న దంపతులు

మేడారం సమ్మక్క-సారలమ్మల దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. మహా జాతరకు మరో రెండు రోజుల సమయమే ఉన్నప్పటికీ అప్పుడే పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. మొక్కులను తీర్చుకుంటూ నిలువెత్తు బంగారం (బెల్లం), గాజులు, చీరలు సమర్పించుకుంటున్నారు. ఓ దంపతులు తమ పెంపుడు శునకానికి నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకోవడం అందరి దృష్టినీ ఆకర్షించింది.

ఇంట్లో తాము పెంచుకున్న శునకం గతంలో కనిపించకుండా పోయిందట. ఆ సమయంలో ఆ శునకం మళ్లీ తమకు దొరకాలని సమ్మక్క-సారలమ్మలకు మొక్కుకున్నారు. దీంతో అది రెండు రోజుల్లో తిరిగి ఇంటికి చేరుకోవడంతో ఆ దంపతులు మొక్కులు తీర్చుకున్నారు.

More Telugu News