Jagan: సీఎం గారూ.. మీరు ఆందోళనకు గురైనట్లు రాష్ట్రం గుర్తించింది: వర్ల రామయ్య

  • రంగంపేటలో మీ సభ వెలవెల బోయింది
  • జనం తక్కువగా హాజరవడం మీ నిర్ణయానికి వ్యతిరేక రెఫరెండమే కదా?
  • ఇకనైనా రాజధాని తరలింపును మానుకోండి

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ నేత వర్ల రామయ్య ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు. 'ముఖ్యమంత్రి గారు... నిన్న రంగంపేటలో జరిగిన మీ ప్రజా ఉద్యమ వ్యతిరేక సభ వెలవెలబోయిన విషయంతో మీరు ఆందోళనకు గురైనట్లు రాష్ట్రం గుర్తించింది. మంత్రులు, సలహాదారులు, శాసనసభ్యులు హాజరైన సభకు జనం నామమాత్రంగా హాజరవడం మీ నిర్ణయానికి వ్యతిరేక రెఫరెండమే కదా? ఇకనైనా రాజధాని తరలింపును మానుకోండి మరి'  అంటూ ట్వీట్ చేశారు.

More Telugu News