Raghuveera: బావిలో దూకి కుర్రాడిలా ఈతకొట్టిన రఘువీరారెడ్డి

  • ఈతతో సేదదీరిన రఘువీరా
  • సొంత వ్యవసాయ క్షేత్రంలో విద్యార్థులకు దీటుగా ఈదిన కాంగ్రెస్ నేత
  • ఆసక్తి కలిగిస్తున్న వీడియో

ఏపీ పీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి కుర్రాళ్లను తలపించే రీతిలో ఓ పెద్ద బావిలో ఈత కొట్టారు. అనంతపురం జిల్లాలోని నీలకంఠపురంలో ఉన్న తన వ్యవసాయక్షేత్రంలో రఘువీరా ఈత కొడుతూ సేదదీరారు. ఆయనతో పాటు కొందరు బీసీ హాస్టల్ విద్యార్థులు కూడా బావిలో ఈదారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో మీడియాలో ఓ చానల్ లో ప్రసారమైంది. ఎంతో లోతున్న బావిలో ఆయన అలవోకగా ఈదుతూ విద్యార్థులను విస్మయానికి గురిచేశారు.

More Telugu News