Hyderabad: ఈ కేంద్రాల్లో లక్షలాది మంది అభ్యసిస్తున్నారు: రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్

  • కన్హా శాంతివనం  సందర్శించిన రాష్ట్రపతి 
  • రామచంద్రమిషన్‌ 75వ వసంతోత్సవంలో పాల్గొన్న కోవింద్‌
  • 150 దేశాల్లో కేంద్రాలు ఉండడం సంతోషమని వ్యాఖ్య 

రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా శాంతివనంలో అతిపెద్ద మెడిటేషన్‌ సెంటర్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ ఈ రోజు సందర్శించారు. రామచంద్రమిషన్‌ 75వ వసంతోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రామచంద్రమిషన్‌కు 150 దేశాల్లో కేంద్రాలు ఉండడం సంతోషంగా ఉందని చెప్పారు.

ఈ కేంద్రాల్లో లక్షలాది మంది అభ్యసిస్తున్నారని రామ్‌నాథ్‌ కోవింద్ తెలిపారు. బుద్ధుడు, మహావీర్, గురునానక్, వివేకానంద ఆధ్మాత్మిక ప్రతినిధులని ఆయన వ్యాఖ్యానించారు. కన్హా శాంతి వనం ఓ పవిత్ర స్థలమని చెప్పారు. 

More Telugu News