India: విరాట్ కు విశ్రాంతి... తాను ఓపెనర్ ను కానన్న రోహిత్ శర్మ!

  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
  • వన్ డౌన్ లో బరిలోకి దిగనున్న రోహిత్
  • ఇప్పటికే సీరీస్ ను గెలుచుకున్న భారత్

న్యూజిలాండ్ తో జరుగుతున్న చివరి టీ-20 పోరులో టాస్ గెలిచిన భారత జట్టు బ్యాటింగ్ ను ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో కెప్టెన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతిని ఇవ్వగా, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ సారధ్య బాధ్యతలను వహించనున్నారు. టాస్ గెలిచిన అనంతరం రోహిత్ మాట్లాడుతూ, ఈ మ్యాచ్ లో తాను ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ గా బరిలోకి దిగడం లేదని, తన స్థానంలో శాంసన్ దిగుతాడని, తాను వన్ డౌన్ లో వస్తానని తెలిపాడు.

కాగా, ఈ స్టేడియంలో ఐదు టీ-20 మ్యాచ్ లు ఆడిన న్యూజిలాండ్ నాలుగింట గెలిచి, ఒకే ఒక్క మ్యాచ్ లో ఓడిపోయింది. ఈ మైదానం న్యూజిలాండ్ కు గతంలో అచ్చిరావడం ఆ జట్టుకు మానసిక బలాన్ని కలిగిస్తుంటే, ఇప్పటికే సిరీస్ ను సొంతం చేసుకోవడం భారత్ కు బలంగా మారింది.

More Telugu News