Corona Virus: కేరళ రాష్ట్రంలో మరొకరికి సోకిన కరోనా వైరస్

  • భారత్ లో ఇది రెండో కేసు
  • బాధితులు ఇద్దరూ కేరళ వాసులే
  • చైనాలో చదువుతున్న వైద్య విద్యార్థి తొలి బాధితుడు

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా చాపకింద నీరులా భారత్ లోకి చేరుతోందా? అంటే అవుననే అనుమానాలు బలపడుతున్నాయి. ఇప్పటికే కేరళ రాష్ట్రంలో ఓ కేసు నమోదుకాగా, తాజాగా మరో కేసు బయటపడడంతో దేశీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది. చైనాలోని వుహాన్ నగరంలో వైద్య విద్య అభ్యసిస్తున్న ఓ విద్యార్థిని కరోనా వైరస్ బారిన పడినట్లు మూడు రోజుల క్రితం గుర్తించిన విషయం తెలిసిందే. ఆమెను ప్రత్యేక గదిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. తాజాగా చైనాలో పర్యటించి వచ్చిన ఓ వ్యక్తి కూడా వైరస్ బారిన పడినట్లు నిర్ధారించారు. ప్రస్తుతం బాధితుడిని ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందజేస్తున్నట్లు కేంద్ర వైద్యవర్గాలు తెలిపాయి.

More Telugu News