Prakasam District: ఒంగోలులో ప్రార్థనా మందిరం కోసం ఇరువర్గాల మధ్య వివాదం

  • ఓ వర్గానికి వ్యతిరేకంగా మరో వర్గం ఆందోళన
  • భారీగా మోహరించిన పోలీసులు
  • ఆ దారిలో వెళ్తున్నమంత్రులను అడ్డుకున్న ఆందోళనకారులు

ఓ ప్రార్థనా మందిరం వద్ద ఇరువర్గాల మధ్య నెలకొన్న వివాదం కారణంగా ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో ఈ ఉదయం టెన్షన్ నెలకొంది. నగరంలోని జేయంబి చర్చిలో ప్రార్థనల సందర్భంగా ఈ వివాదం మొదలయ్యింది. నగరంలోని ఓ వర్గం తొలుత చర్చిలో ప్రార్థనల కోసం వచ్చింది. వీరు ప్రార్థనలు చేయడానికి వీలులేదంటూ మరో వర్గం చర్చికి తాళాలు వేసింది. దీంతో ఎదుటి వర్గం చర్చి ఎదుట రోడ్డు పైనే బైఠాయించి ఆందోళన చేసింది. అక్కడే ప్రార్థనలు కూడా చేశారు.

ఈ విషయం పోలీసులకు చేరడంతో భారీగా తరలివచ్చారు. ఇదే సమయంలో జిల్లా అవతరణ దినోత్సవాలకు హాజరయ్యేందుకు మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్ లు ఇదే దారిలో వెళ్లడంతో వారిని ఆందోళనకారులు అడ్డుకున్నారు.

More Telugu News