Hyderabad: వైభవంగా పరిటాల సునీత కుమారుడి నిశ్చితార్థం... ఆశీర్వదించిన చంద్రబాబు!

  • హైదరాబాద్ లో వేడుక
  • కుమారుడు లోకేశ్ తో కలిసి వచ్చిన చంద్రబాబు
  • నెల్లూరు జిల్లా యువతి తేజస్వితో త్వరలో వివాహం

దివంగత నేత పరిటాల రవి, సునీత దంపతుల రెండవ కుమారుడు సిద్ధార్థ నిశ్చితార్థం శుక్రవారం రాత్రి హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబుతో పాటు లోకేశ్ తదితరులు హాజరై, కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. నెల్లూరు జిల్లాలో రైతు కుటుంబానికి చెందిన మామిళ్లపల్లి తేజస్వితో సిద్ధార్థ వివాహాన్ని పెద్దలు నిశ్చయించారు. వీరిద్దరి వివాహమూ త్వరలో జరుగనుంది.

More Telugu News