Union Budget 2020: ఆంధ్రాకు అన్యాయం, తెలంగాణకు మోసం జరిగింది: చలసాని శ్రీనివాస్

  • కేంద్రంపై తిరగబడాలి 
  • రెండు తెలుగు రాష్ట్రాల ఎంపీలు పోరాడాలి
  • సీఎం జగన్, ప్రతిపక్ష నేతలు నోరుమెదపరే?

కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రాకు అన్యాయం, తెలంగాణకు మోసం జరిగిందని ఆంధ్రా మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్ విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, రెండు తెలుగు రాష్ట్రాల ఎంపీలు ఇప్పటికైనా కేంద్రంపై తిరగబడి పోరాడి సాధించుకోవాలని సూచించారు. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి అన్యాయం జరిగితే సీఎం జగన్, ప్రతిపక్ష నేతలు నోరెత్తలేదని విమర్శించారు.

More Telugu News