Sensex: కేంద్ర బడ్జెట్ దెబ్బకు కుప్పకూలిన మార్కెట్లు

  • ఇన్వెస్టర్లను నిరుత్సాహానికి గురి చేసిన కేంద్ర బడ్జెట్
  • 988 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 318 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ

2020-21 ఆర్థిక సంవత్సరానికిగాను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు లోక్ సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇన్వెస్టర్లను నిరుత్సాహానికి గురిచేసింది. ఈ నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కుప్పకూలాయి. బడ్జెట్ ప్రసంగం ప్రారంభానికి ముందు వరకు లాభాల్లో ట్రేడ్ అయిన సూచీలు... బడ్జెట్ ప్రసంగాన్ని ఆర్థిక మంత్రి చదువుతుండగా నష్టాల్లోకి జారుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ ఏకంగా 988 పాయింట్లు పతనమై 39,735కి పడిపోయింది. నిఫ్టీ 318 పాయింట్లు నష్టపోయి 11,661కి దిగజారింది. ఐటీ, టెక్ మినహా ఇతర సూచీలన్నీ నష్టాలను మూటగట్టుకున్నాయి.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టీసీఎస్ (4.24%), హిందుస్థాన్ యూనిలీవర్ (1.73%), నెస్లే ఇండియా (1.68%), టెక్ మహీంద్రా (1.21%), ఇన్ఫోసిస్ (0.08%).

టాప్ లూజర్స్:
ఐటీసీ (-6.74%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-6.18%), ఎల్ అండ్ టీ (-6.15%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-4.94%), ఓఎన్జీసీ (-4.68%).

More Telugu News