Union Budget 2020: తెలంగాణ కోరుతున్న అంశాలు కేంద్ర బడ్జెట్ లో లేవు!: టీఆర్ఎస్ ఎంపీలు

  • ఆర్థిక వ్యవస్థను మెరుగు పరిచేలా ఈ బడ్జెట్ లేదు
  • విభజన చట్టంలోని అంశాల గురించి ప్రస్తావించలేదు
  • కాళేశ్వరం ప్రాజెక్ట్ కు ‘హోదా’ ఇవ్వకపోవడం సబబు కాదు

తెలంగాణ కోరుకున్న అంశాలను కేంద్రం పట్టించుకోలేదని, కేంద్ర బడ్జెట్ లో వాటి గురించి ప్రస్తావించలేదని టీఆర్ఎస్ ఎంపీలు పెదవి విరిచారు. ఆర్థిక వ్యవస్థను మెరుగు పరిచేలా ఈ బడ్జెట్ లేదని, విభజన చట్టంలోని అంశాల గురించి, తెలంగాణ జాతీయ రహదారులు, పారిశ్రామిక కారిడార్ ప్రస్తావించలేదని, రైతులకు, నీటి ప్రాజెక్ట్ లకు ఈ బడ్జెట్ అనుకూలంగా లేదని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కు జాతీయ హోదా కల్పించకపోవడం సబబు కాదని అన్నారు.

More Telugu News