Operation kamala: ‘ఆపరేషన్ కమల’పై పుస్తకం రాస్తా: కర్ణాటక బీజేపీ నేత విశ్వనాథ్ సంచలన వ్యాఖ్యలు

  • మంత్రి పదవి ఇవ్వకపోవడంపై తీవ్ర అసంతృప్తి
  • అవి లేకున్నా బతకగలమని వ్యాఖ్య
  • ‘ఆపరేషన్ కమల’ వెనక కాంగ్రెస్ నేతలు

రెండు రోజుల క్రితం బీజేపీ అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కిన ఆ పార్టీ నేత, మాజీ ఎంపీ హెచ్. విశ్వనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఆపరేషన్ కమల’పై త్వరలోనే పుస్తకం రాస్తానని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, పాత్రధారులు, సూత్రధారులు సహా కారణాలను కూడా సవివరంగా అందులో వెల్లడించనున్నట్టు తెలిపారు. తాను రాసే పుస్తకంలో సంకీర్ణ ప్రభుత్వ పతనానికి గల కారణాలను కూడా వివరించనున్నట్టు తెలిపారు.

‘ఆపరేషన్ కమల’ వెనక కాంగ్రెస్ నేతలు కూడా ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో తమకు హైకమాండ్‌తో పనిలేదని యడియూరప్ప తమతో అన్నారని గుర్తు చేశారు. రాజకీయంగా ఆయన ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారని పేర్కొన్నారు. మంత్రివర్గ విస్తరణ జరగకుంటే అభివృద్ధి కుంటుపడుతుందన్న విశ్వనాథ్.. తమకు మంత్రి పదవులు రాకున్నా బతకగలమని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

More Telugu News