HongKong: హాంకాంగ్ నుంచి విశాఖ వచ్చిన విద్యార్థికి కరోనా పరీక్షలు

  • హాంకాంగ్ లో చదువుతున్న తెలుగు విద్యార్థి
  • ఎయిర్ పోర్టులో స్క్రీనింగ్ టెస్టుల నిర్వహణ
  • జలుబుతో బాధపడుతుండడంతో కరోనా నిర్ధారణ పరీక్షలు జరపాలని నిర్ణయం

ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్న కరోనా వైరస్ జన్మస్థానం చైనాలో ఉండడంతో, అక్కడ్నించి ఇతర దేశాలకు వెళుతున్న వారి ఆరోగ్యంపై సందేహాలు ముసురుకుంటున్నాయి. తాజాగా, హాంకాంగ్ నుంచి స్వస్థలం విశాఖ వచ్చిన ఓ విద్యార్థికి కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆ విద్యార్థి జలుబుతో బాధపడుతుండడమే అందుకు కారణం.  

మధురవాడ అప్పయ్యనగర్ కు చెందిన ఆ విద్యార్థి హాంకాంగ్ లో ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్నాడు. అతడు విశాఖ రావడంతో ఎయిర్ పోర్టులో అతడికి స్క్రీనింగ్ టెస్ట్ చేశారు. జలుబుతో బాధపడుతుండడంతో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఆ విద్యార్థి నుంచి శాంపిల్స్ సేకరించనున్నారు.

More Telugu News