India: మరోసారి టై... సూపర్ ఓవర్ కు సిద్ధమైన భారత్, న్యూజిలాండ్

  • వెల్లింగ్టన్ లోనూ స్కోర్లు సమం
  • మొదట 8 వికెట్లకు 165 రన్స్ చేసిన భారత్
  • లక్ష్యఛేదనలో కివీస్ 7 వికెట్లకు 165 రన్స్

భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య వరుసగా రెండో మ్యాచ్ టై అయింది. వెల్లింగ్టన్ లో జరుగుతున్న నాలుగో టి20 మ్యాచ్ లో స్కోర్లు సమం అయ్యాయి. టీమిండియా తొలుత 8 వికెట్లకు 165 పరుగులు చేయగా, కివీస్ కూడా 20 ఓవర్లలో 7 వికెట్లకు 165 పరుగులు చేసింది. దాంతో మ్యాచ్ సూపర్ ఓవర్ కు దారితీసింది. లక్ష్యఛేదనలో కివీస్ కు చివరి ఓవర్ లో 7 పరుగులు అవసరం కాగా, శార్దూల్ ఠాకూర్ అద్భుతంగా బౌలింగ్ చేసి రెండు వికెట్లు తీసి కివీస్ ను కట్టడి చేశాడు. చివరి బంతికి రెండు పరుగులు తీయాల్సిన స్థితిలో ఆ జట్టు ఒక్క పరుగే తీయడంతో మ్యాచ్ టై అయింది.

More Telugu News