Telangana: కేంద్రం నుంచి అందని సాయం.... తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన టీఆర్ఎస్

  • కేంద్రం వివక్ష ప్రదర్శిస్తోందంటున్న టీఆర్ఎస్
  • ఇప్పటివరకు రూ.50 వేల కోట్లు నష్టపోయామని వెల్లడి
  • ప్రభుత్వ అంచనాలకు అనుగుణంగా నిధులు రావడంలేదని ట్వీట్

తెలంగాణ ఏర్పడినప్పటినుంచి ఇప్పటివరకు కేంద్రం వివక్ష ప్రదర్శిస్తోందని టీఆర్ఎస్ పార్టీ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. 2014 నుంచి ప్రభుత్వ అంచనాలకు అనుగుణంగా కేంద్రం నుంచి సాయం అందడంలేదని ఆరోపించింది. పన్నుల రూపంలో రాష్ట్రానికి రావాల్సిన వాటాతో పాటు గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో రావాల్సిన నిధుల రూపంలో ఇప్పటివరకు తెలంగాణకు రూ.50 వేల కోట్ల పైచిలుకు మేర నష్టం వాటిల్లిందని టీఆర్ఎస్ పార్టీ ఓ ట్వీట్ లో పేర్కొంది. అంతేకాదు, ఏ ఆర్థిక సంవత్సరంలో ఎంత మొత్తం కేంద్రం నుంచి రాష్ట్రానికి అందిందో ఓ పట్టిక రూపంలో వెల్లడించింది.

More Telugu News