germany: జర్మనీలో గుంటూరు జిల్లా విద్యార్థి ఆత్మహత్య

  • ఎంఎస్ చదివేందుకు మూడేళ్ల క్రితం జర్మనీ వెళ్లిన విద్యార్థి
  • కొన్ని పరీక్షల్లో ఫెయిల్ కావడంతో మనస్తాపం
  • తానుంటున్న భవనంపై నుంచి దూకి ఆత్మహత్య

ఎంఎస్ చదివేందుకు మూడేళ్ల క్రితం జర్మనీ వెళ్లిన గుంటూరు జిల్లాకు చెందిన విద్యార్థి మోహనరెడ్డి (23) ఆత్మహత్య చేసుకున్నాడు. ముప్పాళ్లకు చెందిన మోహనరెడ్డిది రైతు కుటుంబం. ఎంఎస్ చదువు నిమిత్తం 2017లో జర్మనీలోని డస్‌బర్గ్-ఈస్సెన్‌ వర్సిటీలో చేరాడు. మరికొన్ని రోజుల్లో కోర్సు పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో కొన్ని పరీక్షల్లో ఫెయిల్ కావడంతో మనస్తాపానికి గురయ్యాడు. నాలుగు రోజుల క్రితం తండ్రి గోవిందరెడ్డికి ఫోన్ చేసిన మోహనరెడ్డి చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నానని, సరిగా చదవలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో తీవ్ర ఒత్తిడి, మనస్తాపానికి గురైన విద్యార్థి బుధవారం తాను నివసిస్తున్న భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

More Telugu News