Tirumala: తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన రద్దీ!

  • 13 కంపార్టుమెంట్లలో భక్తులు
  • దర్శనానికి 8 గంటల సమయం
  • నిన్న రూ. 2.89 కోట్ల హుండీ ఆదాయం

ఏడుకొండలపై రద్దీ ఒక్కసారిగా పెరిగింది. స్వామివారి సర్వదర్శనానికి ఈ ఉదయం 13 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివుండగా, మరింతమంది వస్తున్నారు. సాధారణ సర్వదర్శనానికి 6 నుంచి 8 గంటల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు. టైమ్ స్లాట్, దివ్య, రూ. 300 ప్రత్యేక దర్శనం భక్తులకు దర్శనానికి 2 నుంచి 3 గంటల సమయం పడుతోంది. నిన్న స్వామివారిని 67,103 మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ కానుకల ద్వారా రూ. 2.89 కోట్ల ఆదాయం లభించింది.

More Telugu News