HDFC Bank: నేడు, రేపు జాతీయ బ్యాంకుల బంద్.. ప్రైవేటు బ్యాంకులు పనిచేస్తాయి!

  • 2017 నుంచి పెండింగులో వేతన సవరణ 
  • పరిష్కరించాలంటూ పలుమార్లు చర్చలు
  • ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ వంటి బ్యాంకులు పనిచేస్తాయి

సమస్యల పరిష్కారం కోసం జాతీయ బ్యాంకుల ఉద్యోగులు సమ్మెకు వెళ్తుండడంతో దేశవ్యాప్తంగా నేడు, రేపు ఆ బ్యాంకులు మూతపడనున్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం 60 వేల మంది ఉద్యోగులు సమ్మెకు దిగుతున్నారు. నవంబరు 2017 నుంచి వేతన సవరణ పెండింగులో ఉంది. ఈ సమస్యను పరిష్కరించాలంటూ ఇండియన్ బ్యాంకు అసోసియేషన్ 20 సార్లు చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. దీంతో చివరికి సమ్మెకు దిగాలని నిర్ణయించుకుంది.

బ్యాంకు ఉద్యోగులు, అధికారులు సమ్మెలో పాల్గొంటున్నారు. ఫలితంగా నేడు, రేపు బ్యాంకులు మూతపడనున్నాయి. ఎల్లుండి ఆదివారం కావడంతో ఆ రోజు కూడా సెలవే. అంటే వరుసగా మూడు రోజులు బ్యాంకుల మూత తప్పదు. అయితే, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ వంటి ప్రైవేటు బ్యాంకులకు మాత్రం ఈ సమ్మె ప్రభావం లేదు. ప్రైవేటు బ్యాంకులన్నీ యథావిధిగా పనిచేస్తాయని సదరు బ్యాంకుల వర్గాలు తెలిపాయి.

More Telugu News