Uttar Pradesh: బర్త్ డే పార్టీ అని చెప్పి 15 మంది చిన్నారులను బంధించిన దుండగుడు... యూపీలో హైడ్రామా

  • ఫరూఖాబాద్ లో ఘటన
  • దుండగుడి చెరలో కొందరు మహిళలు!
  • పోలీసులపై కాల్పులు జరిపిన దుండగుడు
  • ఒకరికి గాయాలు

ఉత్తరప్రదేశ్ లోని ఫరూఖాబాద్ లో ఓ దుండగుడు 15 మంది చిన్నారులను బందీలుగా పట్టుకోవడం తీవ్ర కలకలం రేపింది. ఓ వ్యక్తి బర్త్ డే పార్టీ అని చెప్పి చిన్నారులను పిలిచి తన ఇంట్లో వారిని నిర్బంధించాడు. అతడి చెరలో కొందరు మహిళలు కూడా ఉన్నట్టు సమాచారం. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆ ఇంటిని చుట్టుముట్టడంతో దుండగుడు వారిపై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఒకరికి గాయాలయ్యాయి. దాంతో ఏటీఎస్, స్వాట్, క్యూఆర్టీ బలగాలను రప్పించి ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. దుండగుడు మద్యం మత్తులో ఉన్నట్టు అక్కడి వారు చెబుతున్నారు.

More Telugu News