Asaduddin Owaisi: గాడ్సే దేశభక్తుడంటూ బీజేపీ ఎంపీలు వేడుకలు చేసుకుంటున్నారు: అసదుద్దీన్ ఒవైసీ ఎద్దేవా

  • గాంధీ వర్థంతి రోజున ఒవైసీ వ్యాఖ్యలు
  • గాడ్సేను నిందించేందుకు నిరాకరిస్తున్నాంటూ బీజేపీ ఎంపీలపై విమర్శలు
  • దుశ్చర్యను దేశభక్తిగా చిత్రీకరించే ప్రయత్నాలంటూ ఆగ్రహం 

జాతిపిత మహాత్మాగాంధీ వర్థంతి రోజున ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గాడ్సే ఓ దేశభక్తుడంటూ బీజేపీ ఎంపీలు సంబరాలు జరుపుకుంటున్నారని ఆరోపించారు. గాడ్సేను బహిరంగంగా నిందించేందుకు వారు నిరాకరిస్తున్నారని, పైగా, అతడి ఉద్దేశాలను అర్థం చేసుకోవాలంటూ సూచిస్తున్నారని వ్యాఖ్యానించారు. వారు ఓ ఉగ్రవాదిని క్షమిస్తున్నారని, అతడి దుశ్చర్యను దేశభక్తిగా చిత్రీకరించే ప్రయత్నాలను ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోమని ఒవైసీ స్పష్టం చేశారు.

More Telugu News